రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

by Disha Web Desk 20 |
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ, మామడ : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కిషన్ రావ్ పేట్ గ్రామంలో చెరువు కట్ట మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూపాయలు 56 లక్షల 80,000 లతో ఈ పనులను చేపడుతున్నామని, మూడు నెలల్లో పనులను పూర్తి చేయాలన్నారు.

రైతు బీమా, రైతుబంధు పథకాలు ప్రవేశపెట్టడంతో రైతులకు లబ్ధి చేకూరుతుందని, ఏ గ్రామంలో చూసిన అభివృద్ధి పనులు కంటికి కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి కైలాస్, నాయకులు రామ్ కిషన్ రెడ్డి, మహేందర్, కిష్ణు నాయక్, రేఖా నాయక్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed