- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పాపం రైతు.. తోటకు వెళ్లి.. తేనెటీగలకు బలైపోయాడు
by Dishanational2 |
X
దిశ ,బెల్లంపల్లి : నెన్నెల మండలంలోని లంబడితండాకు చెందిన జలపతి నాయక్ (75 )అనే రైతు తేనె టీగల దాడిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం మామిడి తోటకు వెళ్లాడు. అయితే తోట చుట్టుపక్కల చెట్లు పోదలు ఉన్నాయని వాటిని నరుకుతున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు వచ్చి దాడి చేశాయి. ఈగల దాడి నుంచి రక్షించుకోవడానికి పరుగులు తీసినప్పటికీ ఫలితం లేక పొయింది. కొంత దూరం పరుగెత్తి అలిసిపోయి పడి పోయాడు. రాత్రి వరకు కూడ జలపతి నాయక్ ఇంటికి రాక పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సబ్యులు తోటలో గాలించారు. కొన ఈపిరితో ఉన్న కొట్టుమిట్టాడుతున్న ఆయన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకు వస్తుండగా మార్గమధ్యలోనే తుది శ్వాస విడిచారు. జలపతి నాయక్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story