బైంసా పట్టణంలో నకిలీనోట్ల కలకలం...

by Disha Web Desk 20 |
బైంసా పట్టణంలో నకిలీనోట్ల కలకలం...
X

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో దొంగ నోట్ల కలకలం రేగుతుంది. కొన్ని రోజుల కింద కామారెడ్డి పట్టణంలో దొంగ నోట్ల ముఠాను పట్టుకున్న పోలీసులు తాజాగా బైంసా పట్టణంలో దొంగ నోట్లు తయారు చేసే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భైంసాలో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. కామారెడ్డి క్రైమ్ బ్రాంచ్ పోలిసులు ఆధ్వర్యంలో బైంసా పట్టణంలో విచారణ చేపడుతున్నారు. ఈ మేరకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అనుమానితంగా ఉన్న ఆ ఇద్దరు వ్యక్తుల నుండి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.


Next Story