గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడి..

by Disha Web Desk 20 |
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడి..
X

దిశ, మామడ : మండలంలోని రాయదారి తండా, మామడ తండా, పొనకల్ గ్రామాల్లోని గుడుంబా స్థావరాలపై మంగళవారం ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న సుమారు 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎస్సై రవికుమార్ తెలిపారు. పొనకల్ చెందిన ఓ ఇంటిలో ఓ మూలన పెద్ద గోతినితవ్వి అందులో రెండు ప్లాస్టిక్ డ్రమ్ములను పెట్టివాటిపై సిమెంటుతో తయారు చేసిన ఆర్సీసీ స్లాబ్ ప్లేట్లను పెట్టాడు. అందులో గుడుంబా ప్యాకెట్లను నిల్వ ఉంచి వాటిపై సిమెంట్ మూతపెట్టడంతో ఎవరికి అనుమానం రాకుండా వాటిపై బియ్యం బస్తాలు పెట్టాడు.

ఇంటిని తనిఖీ చేయగా ఓ మూలన ఉన్న గోతిని కనుక్కొని అందులో ఉన్న గుడుంబా ప్యాకెట్లను ధ్వంసం చేసినట్లు ఎస్సై తెలిపారు. గుడుంబా ప్యాకెట్లు అమ్ముతున్న ఐదుగురి పై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా గుడుంబా తయారు చేసిన, అమ్మిన, కొనుగోలు చేసిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story

Most Viewed