అసలు ఈ కుక్కలకి ఏమైంది.. రాష్ట్రంలో రోజుకో చోట కుక్కల దాడి..

by Batti.Sumithra |

ఒకప్పుడు పులులకు, సింహాలకు భయపడే జనాలు ఇప్పుడు కుక్కలకు కూడా భయపడాల్సి వస్తుంది.

అసలు ఈ కుక్కలకి ఏమైంది.. రాష్ట్రంలో రోజుకో చోట కుక్కల దాడి..
X

దిశ, భైంసా : ఒకప్పుడు పులులకు, సింహాలకు భయపడే జనాలు ఇప్పుడు కుక్కలకు కూడా భయపడాల్సి వస్తుంది. రాష్ట్రంలో రోజూకో చోట కుక్కలు మనుషుల పై, జంతువుల పై దాడిచేసిన సంఘటనలు వింటూనే వున్నాం.

ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి బాసర మండల కేంద్రంలోని కొట్టే సాయిలు అనే వ్యక్తికి సంబంధించిన పశువులపై కుక్కలు దాడిచేశాయి. పశువులు కట్టేసి ఉన్న పాకలో కుక్కలు చొరబడిన లేగ దూడను చీల్చితినేశాయి. దీంతో ఆయా ప్రాంత ప్రజలు వీధి కుక్కల బెడదతో భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పంచాయితీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story