పోడు భూముల సర్వేను సజావుగా చేపట్టాలి

by Batti.Sumithra |

పోడు భూముల సర్వేను అధికారులు ఎలాంటి అవకతవకలు లేకుండా చేపట్టాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఛాహత్ భాజ్పాయి అన్నారు.

పోడు భూముల సర్వేను సజావుగా చేపట్టాలి
X

దిశ, చింతలమానేపల్లి : పోడుభూముల సర్వేను అధికారులు ఎలాంటి అవకతవకలు లేకుండా చేపట్టాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఛాహత్ భాజ్పాయి అన్నారు. మండలంలోని ఆడిపల్లి గ్రామంలో పర్యటించి పోడుభూముల సర్వేను పరిశీలించారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం 2005 ప్రకారం పోడు వ్యవసాయ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అందించనున్న పట్టాలకు సంబంధించిన సర్వే సంబంధిత శాఖల అధికారులు ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్బందీగా, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సామరస్యంగా చేపట్టాలని జిల్లా అడీషనల్ కలెక్టర్ తెలిపారు.

Next Story