హైవే పై ప‌సికందు మృత‌దేహం ల‌భ్యం

by Ratna Kumari |   (  Updated:2026-03-18 12:45:57  IST  )

ఆదిలాబాద్ జిల్లాలోని హైవే పై ఓ మగ పసి కందు మృతదేహం లభ్యమైన అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది.

హైవే పై ప‌సికందు మృత‌దేహం ల‌భ్యం
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని హైవే పై ఓ మగ పసి కందు మృతదేహం లభ్యమైన అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల సమీపంలో జాతీయ రహదారి పక్కన పడి ఉన్న ప‌సి కందు మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ పసికందును అక్కడ ఎవరైనా కావాలనే వదిలేశారా..? లేదా అనే కోణంలో విచార‌ణ చేప‌డుతున్నారు.

Next Story