ఇదేం ధమ్కీ రా నాయనా..

by Disha Web Desk 20 |
ఇదేం ధమ్కీ రా నాయనా..
X

దిశ, మంచిర్యాల టౌన్ : అవును వారు దొంగలే కానీ జేబులు కొట్టేయరు, ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేయరు మొబైల్ ఫోన్ లు, ల్యాప్ టాప్ లే వాల్లకు వేదిక, క్లిక్ చేస్తే బుక్ చేస్తారు. లింక్ ఓపెన్ చేస్తే లాక్ చేస్తారు. అంత స్మార్ట్ గ దోచుకుంటారు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఈ కామర్స్ వెబ్సైట్ బిగ్ బిలియన్ డేస్, షాపింగ్ కార్నివాల్ అంటూ ఏదో ఒక పేరు పెట్టి స్పెషల్ ఆఫర్ లతో వినియోగ దారులను ఆకర్షిస్తున్నారు. ఇదే అదునుగా సైబర్ దొంగల ముఠా వారి డాటాను కొట్టేయడానికి కాసుకుకుర్చుంటుంది.

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు సరికొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఏదో ఒకటి ఆశ చూపి, ఎరవేసి సింపుల్ గ క్లిక్ చేయమని చెప్పి క్షణాల్లో లక్షలు కాజేస్తున్నారు. నిత్యం సైబర్ మోసాలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయ్. కొంచం, ఏమేరపాటుగ ఉన్న ఖాతాలోని సొమ్ము అంత ఊడ్చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారిలో సామాన్యులే కాకుండా, విద్యా వంతులు, ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నారు. పోలీస్ లు ఎన్నోసార్లు సైబర్ నేరాల పై అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన కూడా ప్రజలెవరూ వాటిని పట్టించుకోవడం లేదు.

పార్ట్ టైం జాబ్ ఎరగా చూపి..

మంచిర్యాల జిల్లా రామకృష్ణపుర్ కి చెందిన ఒక యువతీ హైదరాబాద్ లోని ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంది. కరోనా సమయం నుండి ఇంటి వద్దే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. ఈ నెల 13 న వర్క్ చేస్తూ ఉండగా పార్ట్ టైం జాబ్ పేరుతో ఒక లింక్ వచ్చింది. అది ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసింది, అది చూసిన ఆన్లైన్ నిర్వాహకుడు యువతికి వాట్శాప్ ద్వారా కాల్ చేసి మీకు జాబ్ వచ్చింది. మీరు 3000 కడితే అదనంగా వస్తాయి అని చెప్పడంతో ఆ యువతీ తన ఖాతా నుండి 3000 రూపాయలు నిర్వాహకుడు పంపిన స్కానర్ ద్వారా పంపింది. వెంటనే 5 నిమిషాలకు 3800 వచ్చినట్టు ఓటీపీ ద్వారా తెలిసింది. ఓటీపీ ఓపెన్ చేసి చుసిన యువతికి నిజంగానే అదనంగా డబ్బులు వచ్చాయి. వెంటనే నిర్వాహకుడికి కాల్ చేసి తెలిపింది. అది విన్న నిర్వాహకుడు మల్లి ఒక 50,000 రూ పంపించండి మీకు దానికి రెట్టింపు డబ్బు ఇస్తాను అని నమ్మ పలికాడు.

అది నమ్మిన యువతీ 50,000 రూ నిర్వాహకుడికి పంపించింది. కొద్దీ సేపటికి నిర్వాహకుడు కాల్ చేసి మీరుపంపిన 50,000 స్ట్రక్ అయ్యాయి మల్లి ఇంకొక 40,000 రూ పంపించండి నేను మీకు తిరిగి దానికి రెట్టింపు డబ్బు పంపిస్తానని చెప్పడంతో యువతీ మల్లి వెంటనే 40,000 రూపాయలు పంపింది. ఇక ఇంకేం ఉంది దానితో నిర్వాహకుడు ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేసి ఆన్లైన్ నుండి వెంటనే తొలగిపోయాడు. అదనంగా డబ్బులు వస్తాయి అని ఎదురు చూస్తూ ఉన్న యువతీ మోస పోయానని గ్రహించి బోరున ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చి తనకు కాల్స్ వచ్చిన నంబర్స్ పై కంప్లైంట్ చేసింది. మొత్తానికి ఆ యువతీ సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కి దాదాపు 90,000 రూపాయలు పోగొట్టుకుంది.

కొరియర్ అని చెప్పి..

మంచిర్యాల పట్టణం రెడ్డికాలనీకి చెందిన ఒక యువకుడు ఇటీవల ఆన్లైన్ లో కళ్ళ అద్దాలు ఆర్డర్ చేసాడు. అది నోటిఫికేషన్ ద్వారా 6 రోజులలో డెలివరీ చేయబడుతుందని యువకుడి ఫోన్ కు మెసేజ్ వచ్చింది. కానీ 4వ రోజు నాడే బ్లూ డార్ట్ కొరియర్ నుండి మాట్లాడుతునం సర్ మీరు ఆర్డర్ చేసిన కళ్ళ అద్దాలు వచ్చాయి, కానీ మీ అడ్డ్రస్ నాకు తెలియడం లేదు మీ ఫోన్ లో ఎని డెస్క్ అనే ఒక అప్లికేషన్ లింక్ నేను పంపిస్తాను దాన్ని డౌన్ లోడ్ చేయండి అని నమ్మబలికాడు. కొరియర్ బాయ్ మాటలు విన్న యువకుడు నిజమే కావచ్చు అనుకొని ఎని డెస్క్ యాప్ ను ఇంస్టాల్ చేసుకున్నాడు. కొద్దిసేపటికే కొరియర్ బాయ్ వచ్చి ఆర్డర్ ని తనకు అప్పజెప్పాడు. ఇదంతా బాగానే ఉంది కానీ సాయంత్రం వరకు రూ.1,20,000 యువకుని ప్రమేయం లేకుండానే వేరే ఖాతా లో జమ చేయపడ్డాయి. ఇది చూసిన యువకుడు ఏదో మోసం జరిగిందని గ్రహించి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. అనంతరం పోలీస్ లు మోసం చేసింది కొరియర్ కంపెనీ వాళ్ళ , సైబర్ మోసగాళ్ల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి మోసపోయిన వారిలో ఎక్కువగా విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉన్నత ఉద్యోగులు, లాయర్ లు, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. ఇటీవల అయితే ఒక ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ సంస్థకు చెందిన జెనరల్ మేనేజర్ కూడా ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీళ్లంతా ఆత్యాశకు పోయి డబ్బులు ఫ్రీగా వస్తాయి కదా అనే ఆలోచనలతో అనవసరం అయినా అప్ లు ఇన్స్టాల్ చేసుకుని ఖాతాలో ఉన్న డబ్బును అంతా పోగొట్టుకొని బాధపడుతూ పోలీస్ స్టషన్ కి వచ్చి కంప్లైంట్ చేస్తునారు. మంచిర్యాల పట్టణంలో 2022 నుండి 2023 సంవత్సరం దాదాపు 300 మంది ఆన్లైన్ మోసాలకు భలి అయ్యారు.

సైబర్ నేరాల పై జాగ్రత్తగా ఉండాలి.. మంచిర్యాల పట్టణ సీఐ ఎం.రాజు

ప్రజలు సైబర్ మోసాలపై అవగాహన పెంచుకొవాలి. సైబర్ నేరగాళ్ల నుండి మోసం ఏ విధంగా జరుగుతుందో ముందే ఉహించి పలుజాగ్రతలు తీసుకోవాలి. అనవసరం అయిన యాప్ లు ఇన్స్టాల్ చేయకూడదు. ఓటీపీలు ఎవరికీ షేర్ చేయకూడదు. ఒక వేళా మోస పోయామని తెలిస్తే వెంటనే కంప్లైంట్ చేయండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. వెంటనే కంప్లైంట్ చేయడం వళ్ళ సమస్య పరిష్కారం అయ్యే మార్గం ఉంటుంది. మీ వివరాలు గోప్యంగా ఉంచపడుతాయి. టోల్ ఫ్రీ నే 1930 వెబ్సైట్ www.cybercrime.govt.in. ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చు.

Next Story