కౌన్సిలింగ్‌తో తిరిగి మళ్లీ ఒక్కటైన దంపతులు...

by Taduka Kalyani |

నిర్మల్ జిల్లా భైంసా ఎస్పీ క్యాంపు ఆఫీస్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తూ సత్ఫలితాలు అందిస్తోంది.

కౌన్సిలింగ్‌తో తిరిగి మళ్లీ ఒక్కటైన దంపతులు...
X

దిశ, బైంసా : నిర్మల్ జిల్లా భైంసా ఎస్పీ క్యాంపు ఆఫీస్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తూ సత్ఫలితాలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో భైంసా పట్టణానికి చెందిన భార్యాభర్తలు గత కొన్ని నెలలుగా మనస్పర్ధలతో దూరంగా ఉంటున్నారు. వారి సమస్యను శ్రద్ధగా విన్న పోలీసులు, కౌన్సిలింగ్ నిర్వహించి పరస్పర అవగాహన కల్పించారు. పోలీసుల సమర్థమైన చొరవతో ఆ దంపతులు తమ విభేదాలను మరచి మళ్లీ కలిసిపోయి ఆనందంగా జీవించేందుకు నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా దంపతులు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల కి పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story