బైంసాలో డబుల్ బెడ్ రూమ్ బాధితుల గందరగోళం

by Disha Web Desk 12 |
బైంసాలో డబుల్ బెడ్ రూమ్ బాధితుల గందరగోళం
X

దిశ, బైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కొనసాగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపికలో బాధితులు గందరగోళం చేపట్టారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల స్థలాలలో ప్రస్తుత డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని ఇప్పుడు స్థలాలు ఇచ్చిన మాకే ఇల్లు ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఇప్పటి బీఆర్ఎస్ సర్కార్ వాటిని రద్దు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన ఈరోజు ఇల్లు కేటాయించక పోవడంతో హామీ కాస్త తుంగలో తొక్కారు.

ప్రస్తుత డబుల్ బెడ్ రూమ్స్ లిస్టులో తమ పేర్లు లేవని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక గార్డెన్ సమీపంలో ఆందోళనకు దిగగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మా స్థలాలు మాకు కావాలని ఆందోళన చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల స్థలాల బాధితులకు చివరకు నిరాశ మిగిలింది. దీంతో స్థలాలు మాయి ఇల్లు వేరే వాళ్లకు అంటూ పలువురు రోదనలు మిన్నంటాయి.


Next Story

Most Viewed