మంత్రి కాన్వాయ్ ని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తల యత్నం

by Disha Web Desk 1 |
మంత్రి కాన్వాయ్ ని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తల యత్నం
X

దిశ, లోకేశ్వరం: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ బీజేపీ నాయకులు శుక్రవారం లోకేశ్వరంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకునేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. లోకేశ్వరంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరయ్యేందుకు వస్తుండగా అడ్డుకునే యత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, డబుల్ బెడ్ రూం ఇల్లు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, చేపట్టలేదని, కేసీఆర్ డౌన్ డౌన్ అంట ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్న వారిలో సాయినాథ్, సంజీవ్ సందీప్, తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed