బేల్ తరోడ సర్పంచ్ వినూత్న నిరసన...

by Disha Web Desk 20 |
బేల్ తరోడ సర్పంచ్ వినూత్న నిరసన...
X

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా తానూరు మండలంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో బేల్ తరోడ సర్పంచ్ గోప సాయినాథ్ వినూత్న నిరసన చేపట్టాడు. నల్లని చొక్క ధరించి తెల్లని అక్షరాలతో ఏండ్లు గడిచిన వన సేవకుని భృతి చెల్లించకపోవడం సిగ్గు అని, అవినీతి తిమింగలాలు ఏపీవో గంగాధర్, టి.ఏ జితేందర్, రాజశేఖర్ ల వైఖరి నశించాలంటూ సభకు రాసుకొని వచ్చాడు.

కూలీలకు తక్కువ చెల్లిస్తున్నారని, కూలీల రోజు వారి కూలి పెంచాలని, పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులకు బిల్లులు ఇప్పటికి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లని చొక్కా నల్లని పాయింట్ ధరించి ప్రజావేదికలో సర్పంచ్ ఇలా సమస్యలను తన చొక్కా పై రాసుకుని రావడంతో అక్కడ ప్రజా వేదికకు హాజరైన పలువురు సైతం అవాక్కయ్యారు.



Next Story

Most Viewed