దిశ ఎఫెక్ట్ : సమయపాలన పాటించని ఉపాధ్యాయునికి మెమో జారీ

by Bhanu |

"మూడు గంటలకే పాఠశాలకు తాళం"అని దిశ పత్రికలో ప్రచురితమైన వార్తకి విద్యాశాఖ అధికారులు స్పందన కనబరిచారు.

దిశ ఎఫెక్ట్ : సమయపాలన పాటించని ఉపాధ్యాయునికి మెమో జారీ
X

దిశ, భైంసా : "మూడు గంటలకే పాఠశాలకు తాళం"అని దిశ పత్రికలో ప్రచురితమైన వార్తకి విద్యాశాఖ అధికారులు స్పందన కనబరిచారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని లింగా గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలకి ఉపాధ్యాయుడు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకే పాఠశాలకు తాళం వేసి వెళ్ళిన నేపథ్యంలో దిశ పత్రికలో వార్త ప్రచురితం అయ్యింది. దీనిపై ఎంఈవో సుభాష్ సదరు ఉపాధ్యాయునికి మెమో జారీ చేసి, వివరణ తీసుకున్నమని పేర్కొన్నారు. ఇట్టి వివరణనను డీఈవోకి ఇన్ఫార్మ్ చేశామని తెలిపారు. దీనిపై జిల్లా విద్యాధికారి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Next Story