అట్టహాసంగా అక్షయ తృతీయ భూమి పూజ

by Disha Web Desk 1 |
అట్టహాసంగా అక్షయ తృతీయ భూమి పూజ
X

దిశ, పెంబి: అక్షయ తృతీయ సందర్భంగా శనివారం రోజున నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని స్వాధ్యాయ పరివారము గ్రామ ప్రజలు యోగేశ్వర క్షేత్రంలో భూమి పూజను అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం మహిళలు కలుశాలతో కృష్ణం వందే జగద్గురుం అంటూ కృష్ణాష్టకాలను పఠిస్తూ.. శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం యోగేశ్వర కృషిలో భూమి పూజ నిర్వహించి నాగళ్లతో దున్నారు. వివిధ గ్రామాల నుంచి స్వాధ్యాయ పరివార్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Next Story