పకడ్బందీగా అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాట్లు

by Naveena |
పకడ్బందీగా అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాట్లు
X

దిశ, ఇంద్రవెల్లి : ఈ నెల 20న ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించనున్న అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ రాజార్షిషా ఆదేశించారు. బుధవారం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద సభ ఏర్పాట్లను ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తో కలసి పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు శాంతియుతంగా అమరవీరులకు నివాలర్పించాలన్నారు. సంస్మరణ సభకు రాష్ట్రమంత్రి సీతక్క హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్,అదనపు కలెక్టర్ శ్యా మాలాదేవి ఏఎస్పి కాజల్ సింగ్, చైర్మన్ నాగోరావ్ ఆదివాసి సర్మెడీలు,నాయకులు తదితరులు ఉన్నారు.పకడ్బందీగా అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాట్లు



Next Story