పిల్లలందరూ కోలుకుంటున్నారు : DMHO సీతారాం

by Ratna Kumari |

ఫుడ్ పాయిజ‌న్ కి గురైన పిల్లలందరూ కోలుకుంటున్నారని DMHO సీతారాం అన్నారు.

పిల్లలందరూ కోలుకుంటున్నారు :  DMHO సీతారాం
X

దిశ, వాంకిడి : ఫుడ్ పాయిజ‌న్ కి గురైన పిల్లలందరూ కోలుకుంటున్నారని DMHO సీతారాం అన్నారు. బుధవారం వాంకిడి ఆసుపత్రిని ఆయన సందర్శించి చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న వైద్యసేవలపై స్థానిక వైద్య సిబ్బందిని ఆరా తీశారు. మంగ‌ళ‌వారం రాత్రి నార్ల పూర్ గ్రామంలో పోచమ్మ విందులో బల్లిపడిన ఆహారం తిని 15 మందికి ఫుల్ పాయిజన్ అయింది. ప్రస్తుతం ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు. సాయంత్రం వరకు అందరూ కోరుకుంటారని చెప్పారు. అనంతరం శివాలయం సమీపంలోని అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు సరైన సమయంలో యుఐపీ టీకాలు వేయాలని సూచించారు. DMHO వెంట వైద్యాధికారి వినయ్ సిబ్బంది ఉన్నారు.

Next Story