అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..

by Disha Web Desk 20 |
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో కోట్లాది రూపాయల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం స్థానిక పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న పలుఅభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతలో మార్పులు లేకుండా నిర్దేశించిన పనులను మూడు రోజులలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభానికి ముస్తాబవుతున్న నిర్మాణ దశలో ఉన్న పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. పట్టణంలో చేయవలసిన ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలకు సంబంధించిన పనుల పురోగతిని పరిశీలించి తగుసూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే, పుర కమీషనర్ గంగాధర్, ఏఈ సాయి, ప్రభుత్వ విప్ వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ రావ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story