రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..

by Disha Web Desk 6 |
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..
X

దిశ, జన్నారం: జన్నారం మండలంలోని చింతపల్లికి చెందిన దాసరి తరుణ్ (22) ఆదివారం రాత్రి బొమ్మెన మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ అదుపుతప్పి పడిపోయి మృతి చెందాడు.

మండలంలోని చింతగూడలో చనిపోయిన ఎంబీబీఎస్ విద్యార్థి దాసరి హర్ష అంత్యక్రియలకు వెళ్లి రాత్రి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కుమారుడు తరుణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుని తండ్రి శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం విదేశాల్లో పనిచేస్తున్నారు. మృతుని తల్లి స్వప్న, సోదరికి గత సంవత్సరం వివాహమైంది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంలో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed