గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న యోగా మాస్టర్..

by Disha Web Desk 20 |
గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న యోగా మాస్టర్..
X

దిశ, రామకృష్ణాపూర్ : రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై చేతుల మీదుగా యోగ ట్రైనర్, హోం గార్డు ముషిని వెంకటేశ్వర్లు అవార్డును అందుకున్నారు. రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు నిత్యకృత్యంగా విరామం లేకుండా ప్రతిరోజు యోగా విధానంతో 108 సూర్య నమస్కారాలు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటూ చాలా మందికి యోగ నేర్పిస్తున్నారు.

ఇందుకు గాను తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌ రాజ్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేశ్వర్లకు రాష్ట్ర గవర్నర్‌ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు. యోగ సూర్య నామస్కారలతో తనకు అవార్డు లభించినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. వెంకటేశ్వర్లకు అవార్డు రావడంతో పట్టణవాసులు హర్షంవ్యక్తం చేశారు.



Next Story

Most Viewed