సమయపాలన పాటించని పల్లె ధవాఖాన..!

by Batti.Sumithra |

పార్డి బీ గ్రామంలోని పల్లె దవాఖాన శనివారం (ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్) సమయం దాటినా తాళం తెరుచుకోలేదు.

సమయపాలన పాటించని పల్లె ధవాఖాన..!
X

దిశ, కుబీర్ : మండలంలోని పార్డి బీ గ్రామంలోని పల్లె దవాఖాన శనివారం (ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్) సమయం దాటినా తాళం తెరుచుకోలేదు. సమయపాలన పాటించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనిచేయాలి. సమయపాలన పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఒకపక్క పెరిగిన ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న నిరుపేదలకు సలహాలు సూచనలతో పాటు వైద్య సేవలు అందించాలి. ప్రైమరి హెల్త్ ప్రొవైడర్ అందుబాటులో లేకపోవడతో ఆర్ఎంపీలను ఆశ్రయించాల్సి వస్తుందని నిరుపేదలు అంటున్నారు. సంబంధిత శాఖ జిల్లా అధికారులు నిరుపేదలకు మెరుగైన వైద్యం అందాల చూడాలని స్థానికులు అంటున్నారు.

Next Story