రైలు నుండి కిందపడి వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

దిశ‌, ఆసిఫాబాద్ : రైలు నుంచి కింద ప‌డి వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న ఆసిఫాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. రైల్వే కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

రైలు నుండి కిందపడి వ్య‌క్తి మృతి
X

దిశ‌, ఆసిఫాబాద్ : రైలు నుంచి కింద ప‌డి వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న ఆసిఫాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. రైల్వే కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సికింద్రాబాద్ నుంచి ధానాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు వెళ్తున్న క్ర‌మంలో కాగ‌జ్ న‌గ‌ర్ రైల్వే స్టేష‌న్ ప్లాట్ ఫాం నెంబ‌ర్ 01 నుంచి ప్ర‌మాద‌వ‌శాత్తు జారి కింద ప‌డ్డాడు. దీంతో తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికులు గ‌మ‌నించి అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి త‌ర‌లించగా.. వైద్యులు ప‌రీక్షించి అప్ప‌టికే మృతి చెందిన‌ట్టు పేర్కొన్నారు. గ్రీన్ క‌ల‌ర్ రౌండ్ నెక్ ఆఫ్ టీ ష‌ర్డ్ ధ‌రించాడు. బ్లాక్ క‌లర్ నైట్ ప్యాట్ ధ‌రించిన‌ట్టు కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపారు.

Next Story