మహిళతో ఆ సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్.. చివరికి ఏం జరిగిందంటే..

by Disha Web Desk 20 |
మహిళతో ఆ సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్.. చివరికి ఏం జరిగిందంటే..
X

దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలిస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ మహిళకు అబార్షన్ చేపించాడు. అనంతరం ఆ మహిళ క్రిమిసంహారక మందు సేవించి నిర్మల్ జిల్లా హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా జవ్వాజి రాజేశ్వర్ PC 2814 CCTNS గా పని చేస్తున్నాడు.

గత సంవత్సరం నుండి సంతపురి లలిత (29) ఖానాపూర్ లోని ప్రయివేట్ హాస్పిటల్ లో సిస్టర్ గా పనిచేస్తూ, పట్టణంలోని విద్యానగర్ నివాసం వుంటుంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆమెను పెండ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని నెలక్రితం ఆబార్శన్ చేయించాడని, ఆతర్వాత పట్టించుకోవడం లేదని ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆ మహిళ మనస్తాపానికి గురై గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను నిర్మల్ హాస్పిటల్ కు తరలించారు. కానిస్టేబుల్ పై కేసునమోదు చేసి అరెస్టు చేశారు.



Next Story

Most Viewed