ప్రాణం తీసిన ఈత సరదా..

by Disha Web Desk 20 |
ప్రాణం తీసిన ఈత సరదా..
X

దిశ, జన్నారం : ఈతకు వెళ్లిన బాలుడు నీళ్లలో మునిగి మృతి చెందిన సంఘటన జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే తపాలపూర్ గ్రామానికి చెందిన, ముటికే గోపాల్, మమతల కుమారుడు ముటికే మౌర్య తేజ (14) తన నలుగురు స్నేహితులతో కలిసి గ్రామం పక్కనే ఉన్న వాగులో ఉన్న పెద్ద బావిలో ఈతకు వెళ్లారు.

మౌర్య తేజకు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికలు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గోపాల్ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. స్థానిక అదనపు ఎస్సై తానాజీనాయక్ సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించి, మృతదేహాన్ని శవ పంచానామాకు పంపినట్లు తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed