రూ.3 లక్షల గంజాయి పట్టివేత

by Ratna Kumari |

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రూరల్ మండలంలో రూ.3 లక్షలు విలువ చేసే గంజాయి మొక్కులు పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై విష్ణు వర్ధన్ తెలిపారు. ఆదివారం మండలంలోని

రూ.3 లక్షల గంజాయి పట్టివేత
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రూరల్ మండలంలో రూ.3 లక్షలు విలువ చేసే గంజాయి మొక్కులు పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై విష్ణు వర్ధన్ తెలిపారు. ఆదివారం మండలంలోని అంకాపూర్ కొలాంగూడ గ్రామంలో కుమ్ర భీంరావు అనే రైతు పొలంలో దాడి చేసి 30 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గంజాయి సాగు చేసినా, విక్రయించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచనామా నిర్వహించి నింధితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఏఈఓ నివేదిత, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Next Story