163 బీఎన్ఎస్ఎస్ ఉల్లంఘించిన 30 మంది పై కేసు న‌మోదు

by Nallavelli.Anjaneyulu |

దిశ, బోథ్ : గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలలో 163 బీఎన్ఎస్ఎస్

163 బీఎన్ఎస్ఎస్ ఉల్లంఘించిన 30 మంది పై కేసు న‌మోదు
X

దిశ, బోథ్ : గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలలో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉండడం వల్ల నిబంధనలకు విరుద్ధంగా బోథ్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలలో బుధవారం ఓటు వేసిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడి ఉన్న వారిపై కేసు నమోదు చేసిన‌ట్టు బోథ్ ఎస్సై శ్రీ సాయి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు అన్నారు. రంగులు చల్లుకోవడం, టపాకాయలు వెలిగించడం ఇలాంటివి చేయకూడదని తెలిపారు. ఇతరులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై నిఘా ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు.

Next Story