బ్యాంక్ లో 13.71 కోట్ల స్కామ్...రీజినల్ మేనేజర్ కీలక ప్రకటన

by velandi.Saikiran |

చెన్నూర్ పాత బస్టాండ్ ప్రాంతంలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో జరిగిన బంగారం, నగదు లావా దేవి స్కాములో

బ్యాంక్ లో 13.71 కోట్ల స్కామ్...రీజినల్ మేనేజర్ కీలక ప్రకటన
X

దిశ, చెన్నూర్: చెన్నూర్ పాత బస్టాండ్ ప్రాంతంలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో జరిగిన బంగారం, నగదు లావా దేవి స్కాములో ఖాతాదారులకు ఎటువంటి ఆర్థిక నష్టం సంభవించకుండా SBI భరోసా కల్పిస్తుందని రీజినల్ మేనేజర్ రితీష్ కుమార్ గుప్తా అన్నారు. పట్టణంలోని SBI కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... బ్యాంకులో జరిగిన 13.71 కోట్ల స్కామ్ జరిగిందన్నారు.


ఇందులో బ్యాంక్ ఉద్యోగితో పాటు ఒక తాత్కాలిక ఉద్యోగి వారితో పాటు లావాదేవీలు జరిపిన మరో 8 మంది పై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్లు చెప్పారు. అన్ని కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని... త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తారని నమ్మకం ఉందని ఆయన తెలిపారు. ఖాతాదారులు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా సంయమానం పాటించాలని పేర్కొన్నారు.

Next Story