- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో ఐఏఎస్లకు అదనపు బాధ్యతల అప్పగింత
పలువురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పలువురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary ) రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్గా ఉన్న కే.శశాంకకు టీజీఐఐసీ వైస్చైర్మన్, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఎండీగా ఉన్న విష్ణు వర్ధన్రెడ్డి డిప్యూటేషన్ పొడిగింపు రాకపోవడంతో ఆయన స్థానంలో శశాంక ను నియమించారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ఎండీగా ఉన్న వల్లూరి క్రాంతికి మైనింగ్, జీయాలజీ డైరెక్టర్గా నియమించారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో శశాంక ఉన్నారు. సెర్ప్అదనపు సీఈవోగా ఉన్న కాత్యాయని దేవి కి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఫ్యూచర్ సిటీ ఆడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్గా పి.మహేందర్ను నియమించారు. ఆయన ఇప్పటి వరకు ఖమ్మం మెప్మా పీడీ పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లో మహేందర్ మంత్రి కేటీఆర్ ఓఎస్డీగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాజాగా కీలక బాధ్యతలు అప్పగించారు.
- Tags
- IAS






