- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్రవాద మనసు, "అజాదీ కాశ్మీర్" కాన్సెప్ట్.. తెలంగాణపై మాధవీలత వివాదాస్పద వ్యాఖ్యలు
తెలంగాణపై బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు మాధవీలత ఫేస్ బుక్లో వరుస పోస్టులు చేసింది. తెలంగాణ పేరుతో అచ్చం అజాదీ కాశ్మీర్ లా చేస్తున్నారని వ్యాఖ్యానించింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణపై బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు మాధవీలత ఫేస్ బుక్లో వరుస పోస్టులు చేసింది. తెలంగాణ పేరుతో అచ్చం అజాదీ కాశ్మీర్ లా చేస్తున్నారని వ్యాఖ్యానించింది. వాళ్లు అజాదీ కాశ్మీర్ అని కాశ్మీర్ ను భారతదేశం నుండి వేరు చేయాలని డిమాండ్ చేశారని, రేపు తెలంగాణ వాళ్లు కూడా అదే చేసేలా ఉన్నారని మండిపడింది. తెలంగాణలో అందరూ వెళ్లిపోవాలని అంటున్నారని, అందరూ వెళ్లిపోయి మీరొక్కలే మిగలాలి అంటూ ఎద్దేవా చేసింది. ఇది మరేం కాదు ఇది అజాదీ కాన్సెప్టే అంటూ వ్యాఖ్యానించింది. తెలంగాణ భారతదేశంలోనే ఉందని మర్చిపోవద్దని చెప్పింది.
ఇక మరో పోస్టులో.. చాలా మంది తనను ఆంధ్ర వెళ్లిపో అంటున్నారని, కానీ తనకు ఆంధ్రాలో ఎవరున్నారో చెప్పడంలేదని, ఎందుకు వెళ్లాలో చెప్పడంలేదని పేర్కొంది. తన ఇంటి ఓనర్ కూడా తెలంగాణ వాళ్లేనని పైగా ఆయన భూదాన్ కోసం భూమి ఇచ్చిన వ్యక్తి అని చెప్పింది. కానీ వేర్పాటు తీవ్రవాద మనసు ఉన్నవాళ్లు తనను వెళ్లిపోవాలని అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. కాశ్మీరి వాళ్లు కూడా ఇలాగే అనేవాళ్లని, ఇప్పుడు కూడా అంటున్నారని చెప్పింది. కాబట్టి దీనిపై ఖచ్చితంగా ఆలోచన చేయాలని, తాను 2005ను హైదరాబాద్ లోనే ఉంటున్నానని ఏంటి ఇప్పుడు అంటూ ప్రశ్నించింది.
తన పాస్ పోర్ట్, ఆధార్ కార్డ్ ఇండియావేనని ఇప్పుడు ఏం చేద్దామని ప్రశ్నించింది. తెలంగాణ ఇండియాలో ఉందా లేదా అని కన్ఫర్మేషన్ ఇస్తే వీసా అప్లై చేసుకుంటానని, గ్రీన్ కార్డు తీసుకునే అవకాశం ఉందా తెలంగాణలో ఉండటానికి అంటూ ఎద్దేవా చేసింది. ప్రస్తుతం మాధవీలత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మాధవీలతను అసలు ఎవరూ వెళ్లిపోవాలని అనలేదని కేవలం పబ్లిసిటీ కోసమే తెలంగాణపై విషం చిమ్ముతోందనే కామెంట్లు వస్తున్నాయి.






