- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ACB Raid: కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ రెయిడ్స్..

దిశ, వెబ్డెస్క్: కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ తుది దశకు చేరుకున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీగా ఉన్న హరిరామ్ (Hariram) ఇంట్లో ఏసీబీ అధికారులు (ACB Officials) ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మెరుపు సోదాలకు దిగారు. ఈ మేరకు షేక్పేట్ (Shaikpet)లోని ఆదిత్య టవర్స్ (Aditya Towers)లో ఉన్న హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల రెయిడ్స్ కొనసాగుతోన్నాయి. ప్రస్తుతం ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ (Gajwel) ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యహరించారు. హరిరామ్ భార్య అనిత (Anitha) కూడా నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్న ఆమె ప్రస్తుతం వాలంటరీ డైరెక్టర్ జనరల్ (Voluntary Director General) బాధ్యతల్లో కొనసాగుతున్నారు. సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తుల ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. గజ్వేల్లో 30 ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు.
కమిషన్ ఎదుట హరిరామ్ స్టేట్మెంట్ ఇలా..
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణ అవకతవకలపై గతేడాది సెప్టెంబర్ 27న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్న హరిరామ్ను విచారించింది. ఈ మేరకు జస్టిస్ పీసీ చంద్రఘోష్ (Justice PC Chandraghosh) ఆయనకు 90కి పైగా ప్రశ్నలను సంధించారు. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణ బిల్లుల చెల్లింపులకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ (Kaleshwaram Corporation) ఆర్థిక అంశాలపై సైతం కమిషన్ ఆరా తీసింది. కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు రూ.29,737 కోట్లు వరకు తిరిగి చెల్లించినట్లుగా ఆయన విచారణలో తెలిపారు.
ఇక బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో రూ.64 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించామని పేర్కొన్నారు. ఇక కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను ఇప్పటికే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) డామేజ్కు బాధ్యులెవరంటూ చంద్రఘోష్ కమిషన్.. హరిరామ్ను ప్రశ్నించగా గేట్స్ ఆపరేషన్, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం అందుకు ప్రధాన కారణమని తెలిపారు. 2017లో నాటి ఉన్నత స్థాయి కమిటీ అంశాలను కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ ఫాలో కాలేదని హరిరామ్ కమిషన్ ఎదుట హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు.