పంజా విసిరిన ఏసీబీ.. తహసీల్దార్ శ్రవణ్ ఇంట్లో సోదాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-07 06:47:53  IST  )

కరీంనగర్ లోని గజ్వేల్ తహసీల్దార్ కమటం శ్రవణ్ ఇండ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు.

పంజా విసిరిన ఏసీబీ.. తహసీల్దార్ శ్రవణ్ ఇంట్లో సోదాలు
X

దిశ కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ లోని గజ్వేల్ తహసీల్దార్ కమటం శ్రవణ్ ఇండ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని మహారాజా బార్ అండ్ రెస్టారెంట్ వెనుక ఉన్న ఇంటితో పాటు ఆర్టీసీ కాలనీలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు శ్రవణ్ కుమార్ తండ్రి ఇంటి వద్ద లక్ష్మీనగర్ లోని సోదరి ఇంట్లో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

భారీగా నగదు, బంగారం సీజ్ చేసినట్లు సమాచారం..

సోదాకు వచ్చే ముందు సమాచారం అందుకొన్న తహసీల్దారు శ్రావణ్ హిందూపూర్ కాలనీలోని తన ఇంటినుండి ఒక బ్యాగును కిందకు విసిరేసినట్లు తెలుస్తుంది. బ్యాగులో భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం.

Next Story