ఈడీ విచారణకు గైర్హాజరు.. కవిత ప్లాన్ ఇదేనా?

by Disha Web Desk 4 |
ఈడీ విచారణకు గైర్హాజరు.. కవిత ప్లాన్ ఇదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఉదయం 11 గంటలకు ఈడీ ఎమ్మెల్సీ కవితను విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కవిత తన ప్రతినిధిని ఈడీ ఆఫీస్‌కు పంపింది. సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉందని తాను విచారణకు హాజరు కాలేనని కవిత చెప్పిన కారణంతో ఈడీ ఏకీభవించలేదు. అయితే ఈడీ విచారణ లో భాగంగా ఇవాళ, రేపటితో ముగ్గురు కీలక నిందితుల కస్టడీ ముగియనుంది. సిసోడియా, పిళ్లై, బుచ్చిబాబులను ఎదురుగా పెట్టి కవితను ఈడీ విచారించాలని భావిస్తోంది. ఈ ముగ్గురి కస్టడీ ముగిశాకే విచారణకు హాజరు కావాలని కవిత వ్యుహంగా తెలుస్తోంది.


Next Story