ఎవర్రా మీరంతా.. సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న నెటిజన్లు

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-04-18 10:14:26  IST  )

సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్లు అవ్వాలనే కోరికతో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారు.

ఎవర్రా మీరంతా.. సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న నెటిజన్లు
X

సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్లు అవ్వాలనే కోరికతో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారు. ప్రాంక్ పేరుతో దారినపోయేవారిని భయ‌బ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా బెంగళూరులో ఓ వ్యక్తి రీల్ కోసం బిజీ రోడ్డు మధ్యలో కుర్చీలో కూర్చొని టీ తాగాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు ఇదేం పనిరా బాబు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపని నెటిజన్లు ఏమన్నారు..? పోలీసుల రియాక్షన్ ఏంటో ఈ లింక్‌లో చూడండి.

మరో 10-15 రోజుల్లో గ్రామాలకు రెవెన్యూ అధికారులు రాబోతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గతంలో తన సొంత భూమి మరొకరి పేరుతో నమోదైతే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉండేదని, కానీ తాము తెచ్చిన భూ భారతి చట్టం ప్రకారం అధికారులు ఎవరైనా తప్పు చేస్తే పై అధికారికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. పేదల కన్నీళ్లను తుడిచేందుకే భూ భారతిని తీసుకొచ్చామని వివరించారు. భూ భారతి మంత్రి ఏం చెప్పారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ఏపీలో మద్యం కుంభకోణం కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ స్కాంలో సిట్ ​విచారణకు వైసీపీకి చెందిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ హాజరుకానున్నారు. అయితే ఈ కుంభకోణంలో గత ప్రభుత్వ పెద్దల పేర్లు బయటకు వస్తాయా... రావా అనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో నిన్ననే ఆయన విచారణకు రావాల్సి ఉంది. అనివార్య కారణాలతో రాలేకపోతున్నానని, శుక్రవారం హాజరవుతానంటూ సిట్‌కు సమాచారమిచ్చారు. అసలు ఈ కేసు ఏ మలుపు తిరగబోతుందో ఈ లింక్‌లో చూడండి.

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. హిందీలో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ భామ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అయితే తెలుగులో మాత్రం పలు ఐటమ్ సాంగ్స్ చేసి ఆకట్టుకుంది. ఇటీవల ‘డాకు మహారాజ్’ మూవీలో బాలయ్య సరసన చిందులేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశి సంచలన కామెంట్స్ చేసింది. అవేంటో మీరు ఈ లింక్ ఓపెన్ చేసి చూసేయండి.

Next Story