ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు దారుణ హత్య

by Disha Web Desk 2 |
ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భయానక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధిస్తున్న వ్యక్తిని తల్లి, సోదరుడితో కలిసి యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. బండరాళ్లతో మోది కిరాతకంగా చంపేశారు. యువకుడి తలపై రాయితో ఒళ్లు గగుర్పొడిచేలా యువతి దాడి చేసింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారాం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి అయిందని చెప్పినా వినకుండా మహేశ్ అనే యువకుడు పదే పదే అసభ్యకర మెసేజులు పంపి వేధించినట్లు సమాచారం. వేధింపులు ఎక్కువయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆగకపోవడంతో హత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే, హత్య సమయంలో చుట్టు పక్కల అనేకమంది స్థానికులు ఉన్నా.. ఎవరూ అడ్డుపడకపోవడం గమనార్హం.



Next Story

Most Viewed