పిడుగుపాటుతో యువకుడు మృతి.. ఇద్దరికి గాయాలు

by Disha Web Desk 4 |
పిడుగుపాటుతో యువకుడు మృతి.. ఇద్దరికి గాయాలు
X

దిశ, మరిపెడ, : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బావాజీగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం రావడం తో పిడుగుపాటు వల్ల ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఊడుగుల శ్రీనివాస్, ఈశ్వర్, నాగరాజు కొంతమంది వ్యక్తులు సమీపంలోని చెరువుకట్ట వద్ద వరిధాన్యాన్ని ఆరబోశారు. రాత్రి గాలి దుమారం తీవ్రంగా వస్తున్న నేపథ్యంలో ధాన్యంపై పట్టాలు కప్పుతుండగా వర్షం తీవ్రం కావడంతో వారంతా ఆగి ఉన్న ట్రాక్టర్ కింద కూర్చున్నారు. ఒకేసారి పిడుగుపడగా ఊడుగుల శ్రీనివాస్ (21) అక్కడికక్కడే మృతి చెందారు. ఈశ్వర్, నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 వాహనంలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed