- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పిడుగుపాటుతో యువకుడు మృతి.. ఇద్దరికి గాయాలు
by Disha Web Desk 4 |
X
దిశ, మరిపెడ, : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బావాజీగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం రావడం తో పిడుగుపాటు వల్ల ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఊడుగుల శ్రీనివాస్, ఈశ్వర్, నాగరాజు కొంతమంది వ్యక్తులు సమీపంలోని చెరువుకట్ట వద్ద వరిధాన్యాన్ని ఆరబోశారు. రాత్రి గాలి దుమారం తీవ్రంగా వస్తున్న నేపథ్యంలో ధాన్యంపై పట్టాలు కప్పుతుండగా వర్షం తీవ్రం కావడంతో వారంతా ఆగి ఉన్న ట్రాక్టర్ కింద కూర్చున్నారు. ఒకేసారి పిడుగుపడగా ఊడుగుల శ్రీనివాస్ (21) అక్కడికక్కడే మృతి చెందారు. ఈశ్వర్, నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 వాహనంలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Next Story