ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత.. సొమ్మసిల్లి పడిపోయిన ABVP నేతలు

by Disha Web Desk 2 |
ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత.. సొమ్మసిల్లి పడిపోయిన ABVP నేతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంగళవారం ఏబీవీపీ నేతలు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. పేపర్ లీక్‌పై సీబీఐతో విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా.. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో పలువురు ఏబీవీపీ నేతలు సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.


Next Story

Most Viewed