- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ వెబ్ డెస్క్: హైదరాబాదులో హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది. బస్సు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్లోని యూసఫ్గూడాలో కాసేపటి కిందట వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీ బస్సు ఎక్కుతూ కాలుజారి ఓ విద్యార్థిని బస్సు చక్రాల కింద పడి మృతి చెందింది. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా మృతి చెందిన విద్యార్థినిని యూసఫ్గూడాలోని మాస్టర్స్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్గా గుర్తించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు.
Next Story






