గ్రూప్​1 ప్రిలిమ్స్​పరీక్షను రద్దు చేయండి.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు

by Dishafeatures2 |
గ్రూప్​1 ప్రిలిమ్స్​పరీక్షను రద్దు చేయండి.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు ఈనెల 11న నిర్వహించ తలపెట్టిన గ్రూప్​1 ప్రిలిమ్స్​పరీక్షను రద్దు చేయాలంటూ అభ్యర్థులు కొందరు శుక్రవారం హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వీటిని విచారణకు స్వీకరించిన కోర్టు వివరణ ఇవ్వాల్సిందిగా బోర్డుకు నోటీసులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ గతంలో నిర్వహించిన గ్రూప్​1 ప్రిలిమ్స్, ఏఈఈ సివిల్, జనరల్​నాలెడ్జ్, డీఏఓ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకైన విషయం వెల్లడి కావటంతో బోర్డు ఈ పరీక్షలను రద్దు చేసింది. ఆ తరువాత కొన్నిరోజులకు గ్రూప్​1 ప్రిలిమ్స్​పరీక్షలను ఈనెల 11న నిర్వహించనున్నట్టు బోర్డు ప్రకటించింది. కాగా, దీనిపై ముప్పయి ఆరుమంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. గ్రూప్​1 ప్రిలిమ్స:పరీక్షలను కనీసం రెండు నెలలపాటు వాయిదా వేయాలని పిటీషన్లు దాఖలు చేశారు. పరీక్షకు తాము సన్నద్దం కాలేదని కోర్టుకు తెలిపారు.

ఈ పిటీషన్లపై గతనెల 25న విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కాగా, తాజాగా మరికొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈనెల 11న నిర్వహించ తలపెట్టిన గ్రూప్ 1 ప్రిలిమ్స్​పరీక్షలను రద్దు చేయాలంటూ కోర్టును అభ్యర్థించారు. టీఎస్పీఎస్సీ బోర్డుపై తమకు నమ్మకం లేదని పిటీషన్లలో పేర్కొన్నారు. యూపీఎస్సీ లాంటి సంస్థకు పరీక్ష నిర్వహణ బాధ్యతను అప్పగించాలని కోరారు. ఈ పిటీషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా టీఎస్పీఎస్సీ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 5వ తేదీకి వాయిదా వేసింది.


Next Story

Most Viewed