బ్రేకింగ్: నెల రోజుల్లో కొత్త పార్టీ.. ప్రజా యుద్ధనౌక గద్దర్ సంచలన ప్రకటన

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: నెల రోజుల్లో కొత్త పార్టీ.. ప్రజా యుద్ధనౌక గద్దర్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజా యుద్ధనౌక గద్దర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించారు. నెల రోజుల్లో తాను కొత్త పార్టీ ప్రకటన చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన యువ సంఘర్షణ సభకు పీసీసీ ఆహ్వానం మేరకు తాను వచ్చానని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అని.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన ఆకాక్షించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ గద్దర్ కొత్త పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read..

తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ.. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు



Next Story

Most Viewed