రైలు కింద పడి వ్యక్తి మృతి

by Disha Web Desk 4 |
రైలు కింద పడి వ్యక్తి మృతి
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బత్తుల దేవేందర్ (38) అనే వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లికి చెందిన బత్తుల దేవేందర్ పట్టణంలో సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిన్న ఉదయం ఇంటి నుండి వెళ్లి రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికిన ఆచూకీ దొరకలేదు.

ఉదయం కొత్తపల్లి వాసులు మృతుడిని గుర్తించి సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని గుర్తుపట్టి కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆ కారణంగానే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. మృతికి భార్య చిత్ర, కూతురు సాత్విక, కుమారుడు సాయిరాం ఉన్నారు. కాగా మృతుడు దేవేందర్ అనారోగ్యం కారణంతో చనిపోయాడా లేదా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. రైల్వే పోలీస్‌లు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed