కాలేజీ బస్సు, బైక్‌ను బలంగా ఢీకొట్టిన లారీ.. ఒకరు స్పాట్ డెడ్

by Disha Web Desk 4 |
కాలేజీ బస్సు, బైక్‌ను బలంగా ఢీకొట్టిన లారీ.. ఒకరు స్పాట్ డెడ్
X

దిశ, మహబూబ్ నగర్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని ప్రతిభ జూనియర్ కాలేజీకి చెందిన బస్సు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రక్క వీధి గుండా ప్రధాన రహదారి పైకి వస్తుండగా హైదరాబాద్ వైపు నుండి రాయిచూర్ వైపు అతి వేగంగా వస్తున్న లారీ, బైక్‌ను, కాలేజీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పట్టణానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. కాలేజీ బస్సులో ముగ్గురు విద్యార్థులు ఉండగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు లారీని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టణంలో రద్దీ గా ఉండే ప్రాంతంలో భారీ వాహనాలను అనుమతించండంతోనే ఈ ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపించారు.



Next Story

Most Viewed