రేపు బీజేపీ పదాధికారుల సమావేశం.. బండి సంజయ్ దూరం

by Disha Web Desk 2 |
రేపు బీజేపీ పదాధికారుల సమావేశం.. బండి సంజయ్ దూరం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశానికి రాష్ట్ర నేతలు తరలివెళ్లనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆది, సోమవారాల్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, పదాధికారులు ఈ మీటింగ్‌కు హాజరుకానున్నారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న కారణంగా ఆయన దూరం కానున్నారు. రాష్ట్ర శాఖ తరపున బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ నివేదికను జాతీయ పార్టీకి సమర్పించనున్నారు. ఆయనతో డీకే అరుణ, కె.లక్ష్మణ్, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొననున్నారు.

Next Story

Most Viewed