రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక వాటికి ఆన్‌లైన్ టికెట్

by Disha Web Desk 4 |
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక వాటికి ఆన్‌లైన్ టికెట్
X

దిశ, వెబ్‌డెస్క్: రైలు ప్రయాణాల్లో తమ పెంపుడు జంతువులను తీసుకెళ్లేవారికి ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించేలా రైల్వే శాఖ యోచిస్తోంది. పెంపుడు జంతువులు కలిగిన ప్రయాణికులు ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో ప్రయాణించేందుకు మాత్రమే అనుమతి ఉండేది. ఇందుకోసం స్టేషన్ లోని పార్సిల్ కౌంటర్ కు వెళ్లి టికెట్ బుక్ చేసుకోవాలి. సెకండ్ క్లాస్ లగేజ్, బ్రేక్ వ్యాన్ లో ఒక బాక్స్ లో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతించేవారు. ప్రయాణీకుల అసౌకర్యం దృష్ట్యా రైల్వే శాఖ పెంపుడు జంతువులకు ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో మార్పులు చేయాలని రైల్వే శాఖ సంబంధింత శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Read More: ఫైనాన్స్ సంస్థలతో పరిశ్రమల శాఖ కుమ్మక్కు



Next Story

Most Viewed