- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దానం నాగేందర్ అంశంలో హైకోర్టు కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో:బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పిటిషన్ పై ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
కాగా కష్టకాలంలో పార్టీకి వెన్నుపోటు పొడిచారని దానం విషయంలో బీఆర్ఎస్ ఆగ్రహంతో రగిలిపోతున్నది. కాంగ్రెస్ లో చేరిన దానంను హస్తం పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో దానం నాగేందర్ ఎపిసోడ్ ను మరింత సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని న్యాయపోరాటానికి దిగింది. ఈ విషయంలో ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చెందిన రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు.