World photography day: ‘దిశ’ ఫొటో గ్రాఫర్‌కు ఘన సన్మానం

by Disha Web Desk 2 |
World photography day: ‘దిశ’ ఫొటో గ్రాఫర్‌కు ఘన సన్మానం
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక మాట వేలమందిని ప్రశ్నిస్తుంది.. కానీ ఒక చిత్రం కోట్ల మంది ఆలోచనలను మారుస్తుంది. ప్రతి ఒక్కరిలో స్పందన కలిగిస్తుంది. నేడు ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా పత్రికా రంగంలో పనిచేస్తున్న ఫొటోగ్రాఫర్లను స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం సర్టిఫికెట్స్, మెమోటోస్‌ను అందించారు. అవార్డు గ్రహీతలు ఎం.విజయ భాస్కర్ (దిశ), శ్రీనివాస్ శెట్టి (ది హన్స్ ఇండియా పేపర్), కే. సాయిబాబా (నమస్తే తెలంగాణ ), ఎం.ఏ. ముజీబ్ (ది మున్సిఫ్ డైలీ), ఎం.వినయ్ (ది న్యూ ఇండియా ఎక్సప్రెస్), ఎస్.యాదగిరి (మన తెలంగాణ), ఎం.విజయ భాస్కర్ (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా). సామజిక దృక్పథంగా అనేకరకాలుగా ఆలోచించి, శ్రమకోర్చి, ఓపికను వహిస్తూ విధులు నిర్వహిస్తుంటారని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ వై.సంజీవ కుమార్ అన్నారు. స్కై ఫౌండేషన్‌కు ఫొటోగ్రాఫర్లు కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్. వై.సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని, సభ్యులు దీప్తి చందన, హరీష్ కుమార్, ఇఫ్రాన్ తదితరులు పాల్గొన్నారు.




Next Story

Most Viewed