Farmers: రైతన్నలకు పండుగలాంటి ముచ్చట.. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-23 06:20:00  IST  )

రైతన్నకు పండుగలాంటి ముచ్చట.. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన

Farmers: రైతన్నలకు పండుగలాంటి ముచ్చట.. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రైతాంగానికి రేవంత్ సర్కార్ పండుగ లాంటి వార్త. ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన ధాన్యం కొనుగోళ్లకు వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే, ఈ నెలాఖరున వరి కోతలు ప్రారంభమవుతోన్న వేళ అక్టోబర్ మొదటి వారం నుంచి రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సర్కార్ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అదేవిధంగా ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు ప్రక్రియ సుమారు మూడ నెలల పాటు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఇక సన్న వడ్లను పండించిన రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూరియా సమస్యను పూర్తిగా నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

Next Story