కంపెనీ బస్సు బోల్తా.. పలువుకి గాయాలు

by Dishafeatures2 |
కంపెనీ బస్సు బోల్తా.. పలువుకి గాయాలు
X

దిశ, చేగుంట: సిద్దిపేట ప్రాంతం నుండి కార్మికులను తీసుకువస్తున్న కంపెనీ బస్సును వెనక నుండి వస్తున్న ట్రావెలర్ బస్సు ఢీకొట్టింది. దీంతో కంపెనీ బస్సు బోల్తా పడి పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామ శివారులో ఉన్న ఎంఎస్ఎన్ కంపెనీకి సిద్దిపేట ప్రాంతం నుండి కార్మికులను కంపెనీ బస్సులో ఫస్ట్ షిఫ్ట్ కోసం ఉదయం తరలిస్తున్నారు. చేగుంట మండల కేంద్రంలోని బైపాస్ వద్ద ఉన్న ఊర చెరువు సమీపంలో యూటర్న్ వద్ద కంపెనీ బస్సు చేగుంట వైపు మలుపు తీసుకుంటుండగా నిజాంబాద్ నుండి వస్తున్న ట్రావెలర్ బస్సు వేగంగా ఢీకొట్టడంతో కంపెనీ బస్సు బోల్తా పడింది.

ఈ ఘటనలో కంపెనీ బస్సులో ప్రయాణిస్తున్న సుమారు పదిమంది కార్మికుల వరకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ వెంటనే ఎం.ఎస్.ఎన్ కంపెనీకి సమాచారం అందించగా వేరే బస్సును పంపించి కార్మికులను పరిశ్రమకు తరలించారు. ఈ ప్రమాదంలో రవి, శంకర్ రెడ్డి కి తీవ్ర గాయాలు కాగా మరో 10 మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చేగుంట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed