ప్రేమించాలని ఫోన్లో తరచూ వేధింపులు.. వ్యక్తి‌పై కేసు నమోదు

by Disha Web Desk 4 |
ప్రేమించాలని ఫోన్లో తరచూ వేధింపులు.. వ్యక్తి‌పై కేసు నమోదు
X

దిశ , కోనరావుపేట : యువతికి తరుచుగా ఫోన్ చేస్తూ ప్రేమించాలనీ వేధింపులకు గురి చేస్తూ మీ తల్లిదండ్రులకు కూడా చంపేస్తా అని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి పై కేసు నమోదైంది. డిఎస్పీ నాగేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా , కోనరావుపేట మండలం కమ్మరిపేట తండాకు చెందిన యువతిని, కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన గంటాడి సాయి కుమార్ అనే యువకుడు కొన్ని నెలలుగా ఫోన్ కాల్స్, మరియు వాట్సాప్ మెసేజెస్ చేస్తూ వేధిస్తున్నాడు.

తనని ప్రేమించాలని లేకుంటే చంపేస్తా అని బెదిరించడమే కాకుండా మీ తల్లిదండ్రులు కూడా చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కాగా సదరు వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. మహిళలను, అమ్మాయిలని కానీ మైనర్ బాలికలను వేధించడం, ప్రేమించాలని బెదిరించడం, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలు ఎదురైన లేదా మానసికంగా వేధించిబడిన మహిళలు కానీ అమ్మాయిలు కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో గాని లేదా ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు అన్నారు. కంప్లైంట్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామనని, పోకిరీల పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.



Next Story

Most Viewed