కాసాని జ్ఞానేశ్వర్‌కు షాక్.. బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు

by Dishafeatures2 |
కాసాని జ్ఞానేశ్వర్‌కు షాక్.. బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదైంది. ఓ టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. టీడీపీ కార్యాలయంలోకి తాను వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు దాడికి పాల్పడ్డారని గోషామహల్ టీడీపీ సమన్వయకర్త డాక్టర్ ఏఎస్‌రావు బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. గత నెల 29వ తేదీన టీడీపీ కార్యాలయంలో సమావేశం ఉంటే తాను వెళ్లానని, తనను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, అలాగే దాడి చేశారని ఏఎస్ రావు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో తనకు గాయం కూడా అయిందని తెలిపారు. దీంతో పోలీసులు కాసానిపై కేసు నమోదు చేవారు.



Next Story

Most Viewed