- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
55 మెడికల్ కాలేజీలు 8340 ఎంబీబీఎస్సీట్లు

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా గతంతో పోల్చితే మెడికల్ కాలేజీలు భారీగా పెరిగాయని వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి ఇన్మర్మేషన్డాక్యుమెంట్ ను సమర్పించింది. ఆవిర్భావ సెలబ్రేషన్స్సందర్భంగా మెడికల్ కాలేజీల ఏర్పాటు శ్రమపై ప్రభుత్వం ప్రజలకు వివరించనున్నది.ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధీనంలో 27 మెడికల్ కాలేజీలు పెరుగగా, ప్రైవేట్ లో మరో 28 కాలేజీలు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది.55 మెడికల్ కాలేజీల్లో 8340 ఎంబీబీఎస్సీట్లు అందుబాటులోకి రాగా, ఎక్కువ మంది విద్యార్దులకు మెడిసిన్చదివే వెలుసుబాటు కల్గనున్నది.జిల్లాకో మెడికల్ కాలేజీ ప్రోగ్రామ్ స్పీడప్చేయడంతోనే ప్రభుత్వ కాలేజీలు పెరిగాయని అధికారులు ఆవిర్భావ దినోత్సవం రోజు హైలెట్ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఇతరప్రజాప్రతినిధులు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత ప్రభుత్వానిదే అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.