గణేశ్ నిమజ్జనానికి 535 స్పెషల్ బస్సులు : టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్

by Disha Web Desk 1 |
గణేశ్ నిమజ్జనానికి 535 స్పెషల్ బస్సులు : టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో ఈనెల 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్బంగా భక్తుల సౌకర్యార్థం 535 ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడపనుంది. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం రెతిఫైల్‌ బస్‌ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్‌ స్టేషన్‌లో 9959226160 నంబర్లను సంప్రదించగలరని సూచించారు.



Next Story

Most Viewed